PDPL: రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజీలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జిమ్ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. మెడికో విద్యార్థులను కలిసి విద్యా, వసతి, ఆరోగ్య సంబంధిత సమస్యల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్య పరంగా చురుకుగా ఉండాలన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ హిమబిందు సింగ్, వైద్య సిబ్బంది ఉన్నారు.