NDL: నంది కోట్కూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చింతా నాగయ్య అకాల మరణంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జీ మాండ్ర శివానంద రెడ్డి మంగళవారం నంది కోట్కూరుకు చేరుకొని నాగయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.