ప్రకాశం: వెలగపూడి సచివాలయంలో మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం కందుకూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు