E.G: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. ఆదివారం చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహించిన మాసోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిడదవోలులో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.