SKLM: కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్లను గురువారం రాత్రి ప్రకటించింది. జిల్లా గ్రంథాలయ చైర్మన్గా పలాసకి చెందిన పీరుకట్ల.విఠల్ రావును నియమించింది. ఈ మేరకు ఆయన తన పైన నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందున సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అన్నారు.