SKLM: పలాస మండలం కాశీబుగ్గ జగన్నాథ సాగరం పక్కన నూతనంగా నిర్మాణం అవుతున్న ఇంట్లో అత్యంత భయంకర విషపూరితమైన పాము (రక్తపింజరి) సోమవారం హాల్చల్ చేసింది. బుసలు కొడుతూ అటు ఇటు తిరుగుతుండడంతో స్థానికులు చూసి భయాందోళన చెందారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు రావడంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.