సత్యసాయి: రాప్తాడు, ధర్మవరం చెరువులకు కృష్ణా జలాలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హంద్రీనీవా నుంచి PABR కుడి కాలువను అనుసంధానించడం ద్వారా 49 చెరువులను నింపాలని నిర్ణయించారు. MLA పరిటాల సునీత విజ్ఞప్తి మేరకు రూ.4.50 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. 4.70 కి.మీ లింక్ కెనాల్ నిర్మాణం కోసం సర్వే నిర్వహించి, నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.