HYD: నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన విజ్ఞాన్ వైభవ్ 2026 స్పేస్ కన్వెన్షన్ ప్రాజెక్ట్ ఎక్స్ పోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను, ఆవిష్కరణలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఓ రోబో ఆయనకు షేక్యాండ్ ఇచ్చి, స్వాగతం పలికింది. కిషన్ రెడ్డి వెంట పలువురు అధికారులు ఉన్నారు.