NRPT: ఇంటర్ పరీక్ష కేంద్రాలను శనివారం ఎస్సై వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రత సిబ్బందితో మాట్లాడి పరీక్ష జరుగుతున్న సరళిని అడిగి తెలుసుకున్నారు. వంద మీటర్ల దూరం వరకు ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలని, హాల్ టికెట్ లేకుంటే లోపలికి అనుమతించరాదని చెప్పారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని చెప్పారు.