PPM: జియ్యమ్మవలస మండలం పీటిమండ పంచాయతీలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాలు 40 ఏళ్లుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, గర్భిణీలను డోలీలతోనే తరలించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.