శ్రీకాకుళం: మందస పట్టణంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న పురుషోత్తమ స్వామి శనివారం ఆకస్మికంగా మరణించారు. ఆయన ఆలయ అర్చకులుగా సేవలందించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన చూపిన భక్తిశ్రద్ధలు భక్తులను ఆకట్టుకున్నాయి. చిన జీయర్ స్వామికి ప్రియ శిష్యులలో ఒకరుగా గుర్తింపు పొందిన పురుషోత్తమ స్వామికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.