GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బీఆర్ స్టేడియంలో మార్చి 7న భారీ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మై భారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, డీఎస్డీఓ పఠాన్ ఆఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అండర్-13, 13-18, 18 ఏళ్లకు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగుపందేలు నిర్వహించనున్నామని వారు వెల్లడించారు.