సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గ్యాస్ వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా ఏజెన్సీలను నిరంతరం తనిఖీ చేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. వినియోగదారులు ఇండక్షన్ స్టవ్, సోలార్ సిస్టమ్ వైపు మొగ్గు చూపాలని సూచించారు. హోటళ్లకు గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.