AKP: ఇంటి పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఆదేశించారు. ఈ మేరకు పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.