CTR: దిగువ ఎర్రమరాజుపల్లె గ్రామస్తులైన బంగారమ్మ, సౌందర్య, శ్రావణిలు టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. గత 40 ఏళ్లుగా డీకేటీ భూమి తమ అనుభవంలో ఉందని తెలిపారు. తమకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, స్థానిక టీడీపీ నాయకుడు వెంకటాద్రి రెడ్డి తమ కుటుంబంపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు.