కృష్ణా: గోసాల శ్రీవేంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 31న ఉచిత యోగా శిక్షణ నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు 28 రోజులు శిబిరం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఔత్సాహికులు 9133306804 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.