AKP: నర్సీపట్నంలో సోమవారం బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీర జ్యోతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో వీవీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. బాలికల ఆరోగ్యం పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.