EG: ఏలేశ్వరం మండలం చిన్నంపేట జీడిపిక్కల పరిశ్రమ కార్మికుల న్యాయబద్ధమైన పోరాటానికి స్కీం వర్కర్లు ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి పద్మ, మధ్యాహ్నం భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి నార్ల ఈశ్వరి మాట్లాడారు. తక్షణమే పరిశ్రమ తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని లేని పక్షంలో నిరసన చేస్తమన్నారు.