PPM: మన్యం పట్టణంలో ప్రైవేట్ లాడ్జీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి సారించిన పట్టణ పోలీసులు ఒక లాడ్జిలో గంజాయి నిల్వఉంచినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.