W.G: ఆకివీడులోని శ్రీ మదన గోపాల స్వామి ఆలయ పాలకవర్గ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఈవో అల్లూరి సత్యనారాయణ రాజు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ఆసక్తి గలవారు 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.