E.G: రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు పరిధిలోని జంగాల కాలనీ నుంచి కళ్యాణ నగర్ వరకు రుడా నిధులు రూ. 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు రూరల్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నారు.