E.G: సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో దర్శిపాటి నాని, ఏడిద సంపత్ కుమార్, గంపల మంగ, గంపల నాగరాజు, మందపల్లి చిన్ని, గొడత మహేష్, గొడత వీరవెంకట రమణ, కడింపల్లి ధనరాజు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి రూ.20 లక్షల చెక్కును అందజేశారు.