E.G: నిడదవోలులో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, APSSDC ఛైర్మెన్ బూరుగుపల్లి శేషారావు బహిరంగ సభ వేదిక, హెలిప్యాడ్ నిర్మాణం, పార్కింగ్ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.