కృష్ణా: రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. తన సతీమణి నీలిమ, కుమారుడు పునీత్తో కలిసి స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్రకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి జ్ఞాపికను అందజేసి పట్టు వస్త్రంతో ఘనంగా సత్కరించారు.