కోనసీమ: గుంటూరులో జరుగుతున్న మహసభకు ఆదివారం కాజులూరు మండలం నుంచి మాలమహానాడు నేతలు భారీగా తరలి వెళ్లారు. బస్సులతో పాటు పలు వాహనాల్లో గుంటూరు సభకు మాలలు బయలు దేరారు. ఈ సందర్భంగా జై మాల, జై జై మాల నినాదాలు మిన్నంటాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకుంటామంటూ వారు ప్రతిజ్ఞ చేశారు.