కోనసీమ: అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యోగాంధ్ర నిర్వహిస్తోందని చెప్పారు. పలువురు అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు.