నంద్యాల జిల్లా డోన్(మం) జగదుర్తి సమీప జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. రాంగ్ రూట్లో వాహనం నడపడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. క్రేన్ డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని రిమాండు తరలించామని తెలియజేశారు.