SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నమని రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. బుధవారం నిమ్మడ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నుంచి ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.