GNTR: కొల్లిపర మండలంలోని కృష్ణా నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని గురువారం అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నది పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోమవారం కొల్లిపర తహసీల్దార్ జి. సిద్ధార్థ సూచించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లే భక్తులు పొరపాటున కూడా కృష్ణా నది వైపు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు.