SS: పుట్టపర్తిలోని వైసీపీ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ భేటీలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.