కృష్ణా: కలెక్టర్ బాలాజీ కంకిపాడు(M)లోని ఈడుపుగల్లులో నిర్మాణంలో ఉన్న తారురోడ్డును బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి నిర్మాణ నాణ్యత, గతంలో ఎదురైన ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండలంకు చెందిన ఆర్అండ్బీ డీఈఈ బలరాం పాల్గొన్నారు.