VSP: పరువు హత్యతో మరణించిన పోలిపల్లి సూర్యప్రకాశ్కి న్యాయం జరగాలని కోరుతూ గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంఘ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ.. హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగం కల్పించలని డిమాండ్ చేశారు.