TPT: ఉమెన్స్ డే సంధర్భంగా మహిళా సమాఖ్య తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సుమారు 200 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎన్. మంజుల మాట్లాడుతూ.. పేద మహిళలకు ప్రైవేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా శాంతియుత సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.