CTR: ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీసు అధికారులు శనివారం కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణే ధ్యేయంగా వీటిని చేపట్టినట్టు వారు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు, వాహనాల పరిశీలన, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. నేరాలను ముందస్తుగా పసికట్టేందుకు తనిఖీలు ఉపయోగపడతాయని చెప్పారు.