ATP: మార్కెట్ యార్డ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అనంతపురం మార్కెట్ యార్డులో 2025 – 26 సంవత్సరానికి చీనీ మార్కెట్ ద్వారా రూ.1,96,55,420 వసూలు అయ్యింది. పశువులు జీవాలు సంత ద్వారా రూ.1,95,11,990 రుసుము రాగా.. మొత్తం రూ.4,35,90,521 ఆదాయం వచ్చిందన్నారు.