PLD: జిల్లాలో జరగనున్న 16వ జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జేసీ సంజన సింహ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మార్చి 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో పాల్గొనే అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.