CTR: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురువారం రాత్రి జ్ఞాన ప్రసన్నాంబ వద్ద బాల దీపాల ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కలశస్థాపన గణపతి పూజ పుణ్యావచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించి ఆలయ ఆవరణంలో బాల దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరాజు దంపతులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.