NDL: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్యాపిలి మండలం ఎస్. రంగాపురంలో ఎద్దుల బండలాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొని తమ ఎద్దుల బల ప్రదర్శన చేశారు. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయబడ్డాయి. గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడానికి దోహదపడతాయని నాయకులు తెలిపారు.