ATP: గుత్తి మండలంలోని వివిధ గ్రామాల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. గుత్తి మండలంలోని బాచుపల్లి, ఊటకల్లు, బేతపల్లి, యంగనపల్లి తదితర గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు పేరుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.