ELR: దెందులూరు మండలం కొవ్వలికి చెందిన భగవాన్ సత్తుపల్లి వెళ్లేందుకు గురువారం బస్ ఎక్కే సమయంలో జేబులో ఉన్న రూ.50,000 పోగొట్టుకున్నారు. వెంటనే ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ మధు వెంకట రాజా వెంటనే స్పందించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో కేవలం గంటలోనే నగదు తిరిగి అందజేశారు.