W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. స్వయంగా ఆహారాన్ని రుచి చూసిన ఆయన.. భోజన నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల పౌష్టికాహారం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.