SKLM: మొంథా తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఈ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు.