VSP: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే రాజు ఆధ్వర్యంలో బుధవారం వెన్నుపోటు దినం నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లారు. మోసపూరిత హామీలతో ఏడాది పాటు కూటమి ప్రభుత్వం పబ్బం గడిపిందని విమర్శించారు. తక్షణమే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.