CTR: పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పూతలపట్టు TDP కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చని సూచించారు. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.