CTR: ప్రతి రైతు ఈ నెలాఖరుకు ఈ-పంటను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురశ్రీకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ఏఎలప్పురం, కమ్మతిమ్మయ్యపల్లె, గుడిపాల పంచాయతీల్లోని పంటలను పరిశీలించారు. వేరుసెనగ పంటను పరిశీలించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.