నంద్యాలలో మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశానికి వెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో దివంగత సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన పలువురు మంత్రులు, సహచర శాసనసభ్యులతో ముచ్చటించారు.