W.G: పెంటపాడు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ 81% పూర్తయిందని తహసీల్దార్ టి.రాజరాజేశ్వరి తెలిపారు. సోమవారం పెంటపాడులో ఆమె మాట్లాడారు. మొత్తం 22,489 కార్డులకు ఇప్పటి వరకు 18,334 కార్డులు పంపిణీ చేశామన్నారు. కాగా, 22 గ్రామాలకు గాను 17 గ్రామాల్లో రీ- సర్వే పూర్తయిందని, వెస్ట్ విప్పర్రు, బి.కొండేపాడు గ్రామాల్లో రీ-సర్వే జరుగుతుందన్నారు.