ప్రకాశం: ఒంగోలులోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా శ్రీగిరి ఆలయ ధర్మకర్త ఛైర్పర్సన్ ఆలూరి ఝాన్సీ రాణి తెలిపారు. ఐదు రోజులపాటు ఘనంగా వెంకటేశ్వర స్వామికి వేడుకలను, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.