W.G: భీమవరం గొస్తా నది – వేల్పూరు కాలువపై నూతన వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే 1 టౌన్ నుంచి 3టౌన్ మధ్య దూరం మూడు కి.మీ. తగ్గుతుందని వివరించారు. ముఖ్యంగా 2027 పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనను త్వరితగతిన నిర్మించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.