విశాఖ నగరంలోని వీధి వ్యాపారుల సంక్షేమం మాటలకే పరిమితమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర చట్టాల ప్రకారం వారిని గుర్తించి మౌలిక వసతులు, బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ యూసీడీ విభాగం స్పందించడంలేదు. వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిన స్థానంలో, దళారులు ప్రభుత్వ స్థలాలను అద్దెకు ఇచ్చి రూ.50వేలు నుంచి రూ.80వేలు వసూలు చేస్తున్నారు.